విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం వేడుకలు
విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం వేడుకలు
Editor Desk
నల్గొండ,: పట్టణ కేంద్రంలోని విశ్వాస్ హాస్పిటల్లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ Gutta Sukender Reddy పీఏ రాంప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాం చంద్ర (ఆర్థోపెడిక్), డాక్టర్ విశ్వజ్యోతి (గైనకాలజిస్ట్)తో పాటు సిబ్బందిని వారి సేవలకు గాను మెమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
వేడుకలకు ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మహతి తదితరులు హాజరయ్యారు. రాంప్రసాద్ కుటుంబ సభ్యులు, ఇతర అతిథులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
సిబ్బంది సేవలను అభినందిస్తూ, ఇలాంటి సేవాభావంతో ముందుకు సాగాలని అతిథులు ఆకాంక్షించారు. హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి