విశాల భారతి పాఠశాలలో 'సమ్మర్ క్యాంప్' సందడి
విశాల భారతి పాఠశాలలో 'సమ్మర్ క్యాంప్' సందడి
K.RAVI
శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాల భారతి హైస్కూల్ వేసవి శిబిరం (సమ్మర్ క్యాంప్) సోమవారం వి.వి.ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి, ప్రముఖులు బండారు సుజాత శేఖర్, ఆంటోనీ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను కేవలం ఆటలకే పరిమితం చేయకుండా, ఇలాంటి శిబిరాల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. ముఖ్యంగా వేదిక్ మ్యాథ్స్, జ్ఞాపకశక్తి పెంపుదల, చేతిరాత(హ్యాండ్రైటింగ్)మెరుగుపరుచుకోవడం వంటివి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం సమ్మర్ క్యాంప్ కోఆర్డినేటర్ ఆంటోనీ మాట్లాడుతూ.. ఈ శిబిరంలో నేర్పించబోయే 12 రకాల కీలక అంశాల గురించి వివరించారు.
పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలోపాఠశాల డైరెక్టర్ ఆవుల అశోక్ఆందోజు నాగభూషణం,కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, సమ్మర్ క్యాంపు కోఆర్డినేటర్ ఆంటోనీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి