Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:16 PM

విరిగిన కుర్చీలపై సమావేశం భయంతో కూర్చున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

విరిగిన కుర్చీలపై సమావేశం భయంతో కూర్చున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

విరిగిన కుర్చీలపై సమావేశం భయంతో కూర్చున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
April 16, 2026 12:06 PM 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో అవ్యవస్థలు వెలుగుచూశాయి. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏర్పాటు చేసిన కుర్చీలు పూర్తిగా దెబ్బతిన్నవిగా ఉండటం విమర్శలకు దారితీసింది.

మీటింగ్ హాల్లో ఉంచిన పలుచోట్ల ప్లాస్టిక్ కుర్చీలు విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ, వాటినే వినియోగించాల్సి రావడంతో హాజరైనవారు అసౌకర్యానికి గురయ్యారు. కుర్చీలు ఎప్పుడు విరిగిపోతాయోనన్న ఆందోళన మధ్య సమావేశంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశానికి కనీస సదుపాయాలు లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News