వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి: ఉపేందర్
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి: ఉపేందర్
Editor Desk
అడ్డగూడూరు: వికలాంగుల పెన్షన్ను రూ.6 వేలుగా అమలు చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు, జానకాపురం, సవుల్లా రామారం గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఉపేందర్ మాట్లాడుతూ, యూడీఐడీ కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.6 వేల పెన్షన్ను తక్షణమే అమలు చేసి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రతి వికలాంగుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చిర్రగూడూరు, జానకాపురం, సవుల్లా రామారం గ్రామాల్లో ఎన్పీఆర్డీ కమిటీలను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిత్తలూరి శ్రీహరి, మండల అధ్యక్షుడు దుస్సా వెంకటేశం, గ్రామ నాయకులు శీల శోభ, మాదాని బాలరాజు, చింత పరశురాములు, బోనాల బాబు, సంఘీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి