PRINT TIME: May 04, 2026 04:24 PM
విజయ తెలంగాణ డైరీ పార్లర్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
విజయ తెలంగాణ డైరీ పార్లర్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
May 04, 2026 02:48 PM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రసాద్ ఉడిపి హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘విజయ తెలంగాణ డైరీ పార్లర్’ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ పట్టణం అభివృద్ధిలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. పట్టణంలో కొత్తగా బేకరీలు, షాపులు, రెస్టారెంట్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డైరీ పార్లర్ ప్రారంభం కావడం ఆనందదాయకమని తెలిపారు.
ప్రజలు ఇక్కడ లభించే స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ అఖిల్ రామగిరి, డిస్ట్రిక్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, ఓనర్ ప్రదీప్, ప్రొప్రైటర్ పి. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి