Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:46 AM

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం
May 01, 2026 01:10 PM 367 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఉన్న నోచ్ ల్యాబ్స్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని మూడో నెంబర్ రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గత నెల రోజుల క్రితమే ఇదే సంస్థలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం ఇంకా మర్చిపోకముందే మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

“పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంది” అని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, కార్మికుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ ఘటనపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News