Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం
01-05-2026 372 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఉన్న నోచ్ ల్యాబ్స్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని మూడో నెంబర్ రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గత నెల రోజుల క్రితమే ఇదే సంస్థలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం ఇంకా మర్చిపోకముందే మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

“పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంది” అని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, కార్మికుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ ఘటనపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Sthanikam

వెలిమినేడులో నోచ్ ల్యాబ్స్‌లో మళ్లీ ప్రమాదం – కార్మికుల్లో భయం, యాజమాన్యంపై ఆగ్రహం

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఉన్న నోచ్ ల్యాబ్స్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని మూడో నెంబర్ రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో అక్కడి కార్మికులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గత నెల రోజుల క్రితమే ఇదే సంస్థలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం ఇంకా మర్చిపోకముందే మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

“పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంది” అని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, కార్మికుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ ఘటనపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News