Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:59 AM

వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు

వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు

వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు
May 01, 2026 06:22 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్‌లో బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, మానవత్వ మార్గాన్ని చూపిన మహానుభావుడని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకాలని, దయ, కరుణ, సహనం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు బుద్ధుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సంస్థ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బుద్ధుని బోధనలు సమాజ నిర్మాణానికి శాశ్వత మార్గదర్శకాలని అన్నారు. శాంతి, అహింస, మానవసేవ వంటి విలువలు యువతలో పెంపొందాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు మంచి విలువలు అలవర్చుకున్నప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదగగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ మొగిలిచర్ల ప్రదీప్, ప్రిన్సిపల్ బి.వి. రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News