వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు
వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు
Editor Desk
: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, మానవత్వ మార్గాన్ని చూపిన మహానుభావుడని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకాలని, దయ, కరుణ, సహనం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు బుద్ధుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సంస్థ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బుద్ధుని బోధనలు సమాజ నిర్మాణానికి శాశ్వత మార్గదర్శకాలని అన్నారు. శాంతి, అహింస, మానవసేవ వంటి విలువలు యువతలో పెంపొందాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు మంచి విలువలు అలవర్చుకున్నప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదగగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ మొగిలిచర్ల ప్రదీప్, ప్రిన్సిపల్ బి.వి. రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి