వాట్సాప్లో భూ నమోదు సేవలు ప్రారంభం
వాట్సాప్లో భూ నమోదు సేవలు ప్రారంభం
Biksham
ఒక సందేశంతోనే ధ్రువపత్రాలు, రుసుముల చెల్లింపులు సులభం
హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో భూ నమోదు సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో అధికారులు ప్రత్యేక నంబర్ ద్వారా వాట్సాప్లో భూ నమోదు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు 80969 58096 నంబర్కు “హాయ్” అని సందేశం పంపితే, భూ రికార్డుల ధ్రువపత్రం, స్టాంపుల కొనుగోలు, వివిధ రుసుముల చెల్లింపులు వంటి సేవలను సులభంగా పొందవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసిన అనంతరం ధ్రువీకరించిన పత్రాలు నేరుగా వాట్సాప్ ద్వారా అందుతాయి.
ఈ విధానం ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సేవలు వేగవంతంగా అందుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి