వడ్డెర జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకురాలు గుంజే రేణుక నారాయణ
వడ్డెర జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకురాలు గుంజే రేణుక నారాయణ
Editor Desk
తెలంగాణ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన గుంజే రేణుక నారాయణకు తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మంజుల రమేష్ ఆదేశాల మేరకు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా అట్టడుగు వర్గాల వడ్డెర కుల సమస్యలపై గుంజే రేణుక నారాయణ ఎన్నో పోరాటాలు చేశారని, ఎస్టీ సాధనతో పాటు వడ్డెర కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. అలాంటి నాయకురాలు కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక కావడం వడ్డెర జాతికి గర్వకారణమన్నారు.
ఎన్నో ప్రభుత్వాలు మారినా వడ్డెర జాతికి సరైన గుర్తింపు దక్కలేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్ వేముల వీరేశం లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు దుర్గయ్య, మండల అధ్యక్షుడు దండ్ల సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు పల్లపు రవి, వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి