Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 07:44 PM

వచ్చే శ్రీరామనవమి నాటికి ‘రామలయానికి’కి కొత్త శోభ..

వచ్చే శ్రీరామనవమి నాటికి ‘రామలయానికి’కి కొత్త శోభ..

వచ్చే శ్రీరామనవమి నాటికి ‘రామలయానికి’కి కొత్త శోభ..
March 27, 2026 05:43 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..

ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వారాల ఏర్పాటు..

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్గొండ: నల్గొండ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని రామగిరి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ చారిత్రక ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. "దర్శన మార్గాల విస్తరణకు అవసరమైన స్థల సేకరణపై ఇప్పటికే చర్చలు జరిగాయి. నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభిస్తాం" అని మంత్రి వివరించారు.దేవాలయ భూములకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు, నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించినట్లు మంత్రి గుర్తుచేశారు. రామగిరి ఆలయానికి ఉన్న విశిష్ట చరిత్రను కాపాడుతూనే ఆధునిక వసతులు కల్పిస్తామని చెప్పారు. పట్టణ ప్రజలందరూ శ్రీరాముని కృపతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అండగా ఉంటాం మేయర్..

​నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని, భక్తులకు కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు.​ ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు ఇంచార్జీ కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు 'జై శ్రీరామ్' అంటూ రాముని నామ స్మరణలతో మారుమోగాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News