Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:45 AM

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం
May 01, 2026 11:09 AM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిక్షకుడు గంగాపురం రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వాడపల్లి రవీందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రమం తప్పకుండా ఆటలు ఆడడం ద్వారా శరీర దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. క్రీడల ద్వారా శరీరంలో క్యాలరీలు వినియోగించబడటంతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. అలాగే ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత మరియు జ్ఞానశక్తి మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో లక్ష్య సాధనపై పట్టుదల పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ సెక్రటరీ ఉపేందర్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మందుగుల పార్వతమ్మ, మెడబోయిన స్వాతి శ్రీనివాస్, కురుపాటి లింగయ్య, మర్రి రమేష్, బోయ స్వామి, ఉయ్యాల మల్లేష్, జాంగిర్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండా పరమేష్, ఎలుగు చంద్రశేఖర్, సాగర్ల లింగస్వామి, సీనియర్ క్రీడాకారులు రాచమల్ల శ్రీను, హరి ప్రసాద్, బొడ్డు శ్రీను, విద్యార్థులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News