Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 12:20 PM

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం
May 01, 2026 11:09 AM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిక్షకుడు గంగాపురం రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వాడపల్లి రవీందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రమం తప్పకుండా ఆటలు ఆడడం ద్వారా శరీర దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. క్రీడల ద్వారా శరీరంలో క్యాలరీలు వినియోగించబడటంతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. అలాగే ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత మరియు జ్ఞానశక్తి మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో లక్ష్య సాధనపై పట్టుదల పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ సెక్రటరీ ఉపేందర్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మందుగుల పార్వతమ్మ, మెడబోయిన స్వాతి శ్రీనివాస్, కురుపాటి లింగయ్య, మర్రి రమేష్, బోయ స్వామి, ఉయ్యాల మల్లేష్, జాంగిర్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండా పరమేష్, ఎలుగు చంద్రశేఖర్, సాగర్ల లింగస్వామి, సీనియర్ క్రీడాకారులు రాచమల్ల శ్రీను, హరి ప్రసాద్, బొడ్డు శ్రీను, విద్యార్థులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News