Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:24 AM

ఉనికి కోసమే ఆరోపణలు – ఉషశ్రీ చరణ్‌పై వెంకటరమణ ఫైర్

ఉనికి కోసమే ఆరోపణలు – ఉషశ్రీ చరణ్‌పై వెంకటరమణ ఫైర్

ఉనికి కోసమే ఆరోపణలు – ఉషశ్రీ చరణ్‌పై వెంకటరమణ ఫైర్
April 28, 2026 04:13 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రి సవితపై చేస్తున్న ఆరోపణలు ఉనికి కోసం చేస్తున్నవేనని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి చేయలేక, ప్రజల మద్దతు కోల్పోయి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో రాజకీయంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


మంత్రి సవిత నాయకత్వంలో పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉషశ్రీ చరణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించినా ఆమె వైఖరిలో మార్పు లేదని విమర్శించారు.


అన్నా క్యాంటీన్ ద్వారా వేలాది పేదలకు ఆహారం అందించిన ఘనత సవితమ్మదేనని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 1000 రోజులకు పైగా సేవలు అందించారని గుర్తుచేశారు. రాంపురం అభివృద్ధి, పేద విద్యార్థులకు ఉచిత విద్య కోసం ఎంజేపై స్కూల్ స్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.


మంత్రిగా ఉన్న ఐదేళ్లలో స్పందించని సమస్యలు ఇప్పుడు గుర్తొస్తున్నాయా అని ప్రశ్నించిన వెంకటరమణ, పరిగి మండలంలోని ఫ్రీ కాట్ మిల్ మూతపడినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయలేని వారు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.


వ్యక్తిగత విమర్శలకు దిగితే తామూ స్పందించగలమని, కానీ ఆ స్థాయికి దిగజారడం తమ సంస్కృతి కాదని హెచ్చరించారు. ఇకపై మంత్రి సవితమ్మపై అనవసర వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.


పెనుకొండలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులతోనే ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News