Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోగువారిగూడెంలో కిశోర బాలికల అవగాహన సదస్సు డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 05:32 AM

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం
April 29, 2026 04:03 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి......

విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య..

రాష్ట్రంలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోదాడ పట్టణం పెన్షనర్స్ భవనంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏప్రిల్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గత 20 ఏళ్ల క్రితం పరిస్థితి చూస్తే ఉద్యోగి రిటైర్ కావడానికి నాలుగు రోజుల ముందే రావాల్సిన అన్ని బకాయిలు చేతికి వచ్చేవి కానీ, నేడు రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం దురదృష్టకరం అని మండిపడ్డారు.

సకాలంలో రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది విశ్రాంత ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని, ఇది వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మన బోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షులు జానయ్య, గులాం ఎస్దాని, భ్రమరాంబ, బాలేమియా, హాజీ నాయక్, భూపాల్ రెడ్డి, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News