ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్పల్లిలో కేసు నమోదు
ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్పల్లిలో కేసు నమోదు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ గ్రామానికి చెందిన కోతోజు నరేంద్ర చారి, అక్కేనపల్లి గ్రామానికి చెందిన ఎస్కే జహంగీర్ (తండ్రి నజీర్, వయసు 35) ను MSME అవుట్సోర్సింగ్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1,04,000 తీసుకున్నాడు.అయితే ఎలాంటి ఉద్యోగం కల్పించకుండా మోసం చేసినట్లు బాధితుడు గుర్తించాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.1,00,000 ఇవ్వాలని మళ్లీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి