Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు
04-05-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ గ్రామానికి చెందిన కోతోజు నరేంద్ర చారి, అక్కేనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జహంగీర్ (తండ్రి నజీర్, వయసు 35) ను MSME అవుట్‌సోర్సింగ్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1,04,000 తీసుకున్నాడు.అయితే ఎలాంటి ఉద్యోగం కల్పించకుండా మోసం చేసినట్లు బాధితుడు గుర్తించాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.1,00,000 ఇవ్వాలని మళ్లీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Sthanikam

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

Article Image

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ గ్రామానికి చెందిన కోతోజు నరేంద్ర చారి, అక్కేనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జహంగీర్ (తండ్రి నజీర్, వయసు 35) ను MSME అవుట్‌సోర్సింగ్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1,04,000 తీసుకున్నాడు.అయితే ఎలాంటి ఉద్యోగం కల్పించకుండా మోసం చేసినట్లు బాధితుడు గుర్తించాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.1,00,000 ఇవ్వాలని మళ్లీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News