Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:49 AM

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు
May 04, 2026 08:40 PM 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ గ్రామానికి చెందిన కోతోజు నరేంద్ర చారి, అక్కేనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జహంగీర్ (తండ్రి నజీర్, వయసు 35) ను MSME అవుట్‌సోర్సింగ్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1,04,000 తీసుకున్నాడు.అయితే ఎలాంటి ఉద్యోగం కల్పించకుండా మోసం చేసినట్లు బాధితుడు గుర్తించాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.1,00,000 ఇవ్వాలని మళ్లీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News