Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం
15-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రవీంద్రభారతిలో ఘనంగా అవార్డు ప్రదానం

సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన ఊదరి నర్సింహ్మ ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రాష్ట్ర దళిత రత్న’ అవార్డును అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సవాల కో-చైర్మన్లు దొమ్మాటి సుదర్శన్ బాబు, అల్లిబిల్లి మహేందర్‌లు నర్సింహ్మకు ఈ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

బాధ్యత పెరిగింది: ఊదరి నర్సింహ్మ


అవార్డు స్వీకరించిన అనంతరం నర్సింహ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం

Article Image

రవీంద్రభారతిలో ఘనంగా అవార్డు ప్రదానం

సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన ఊదరి నర్సింహ్మ ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రాష్ట్ర దళిత రత్న’ అవార్డును అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సవాల కో-చైర్మన్లు దొమ్మాటి సుదర్శన్ బాబు, అల్లిబిల్లి మహేందర్‌లు నర్సింహ్మకు ఈ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

బాధ్యత పెరిగింది: ఊదరి నర్సింహ్మ


అవార్డు స్వీకరించిన అనంతరం నర్సింహ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News