ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం
ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం
K.RAVI
రవీంద్రభారతిలో ఘనంగా అవార్డు ప్రదానం
సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన ఊదరి నర్సింహ్మ ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రాష్ట్ర దళిత రత్న’ అవార్డును అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సవాల కో-చైర్మన్లు దొమ్మాటి సుదర్శన్ బాబు, అల్లిబిల్లి మహేందర్లు నర్సింహ్మకు ఈ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
బాధ్యత పెరిగింది: ఊదరి నర్సింహ్మ
అవార్డు స్వీకరించిన అనంతరం నర్సింహ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి