టోకెన్ విధానంలో జొన్నల కొనుగోలు ప్రారంభం
టోకెన్ విధానంలో జొన్నల కొనుగోలు ప్రారంభం
Reporter Sangameshwar Reddy
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు : సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి
న్యాల్కల్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి తెలిపారు. టోకెన్ విధానంలో రైతుల నుంచి పంటను స్వీకరిస్తూ పారదర్శకంగా కొనుగోలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటను శుభ్రంగా, తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నామని, ప్రతి రైతుకు సమయానికి కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నీడ, తూకం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి వచ్చి తమ పంటను విక్రయించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి