తుంగతుర్తిలో మాదక ద్రవ్యాలు వినియోగంపై అవగాహన కార్యక్రమం
తుంగతుర్తిలో మాదక ద్రవ్యాలు వినియోగంపై అవగాహన కార్యక్రమం
Bandi Kiran Kumar
మాదకద్రవ్యాలు గాంజా ఇలాంటి డ్రగ్స్ బారి నుండి మన పిల్లలను మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని నేరేడుచర్ల ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న ఐదవ అంశం పిల్లల భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన సందర్భంగా ఈరోజు ఎస్పీ ఆదేశాల మేరకు తుంగతుర్తి మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతికుమార్ మాట్లాడుతూ... మాదకద్రవ్యాలను నిర్మూలించి వాటి భారీ నుండి మన పిల్లలను మన సమాజాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలియజేశారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల యువత జీవితం నాశనం అవుతుందని అనారోగ్యాల పాలవుతారని జీవితం అర్దంతరంగా ముగుస్తుందని తెలియజేశారు. మాదకద్రవ్యాలను గంజాయి లాంటి డ్రగ్స్ ను నిర్మూలించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి