Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:23 PM

తిరువూరు నియోజకవర్గంలో రైతులకు రూ.19.17 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు జమ

తిరువూరు నియోజకవర్గంలో రైతులకు రూ.19.17 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు జమ

తిరువూరు నియోజకవర్గంలో రైతులకు రూ.19.17 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు జమ
14-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం మల్లెల గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో 33,658 మంది రైతులకు రూ.13.46 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు, అలాగే 28,518 మంది రైతులకు రూ.5.70 కోట్లు పీఎం కిసాన్ నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. మొత్తం కలిపి రూ.19.17 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

గత అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా రైతుల సమస్యలపై మాట్లాడానని ఆయన తెలిపారు. రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే జీవిస్తాడు, అప్పుల్లోనే మరణిస్తాడని పేర్కొన్నారు. అంతటి కష్టాలు పడుతూ కూడా రైతు అందరికీ అన్నం పెడుతున్నాడని, రైతుల కష్టం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. అలాంటి కష్టాల్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ పథకం మూడవ విడతగా రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడో విడత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2,676 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,874 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పున జమ చేయగా, ఈరోజు జమ చేస్తున్న రూ.6 వేలతో కలిపి రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎమ్మార్వో, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ నాయకులు, రైతులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు నియోజకవర్గంలో రైతులకు రూ.19.17 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు జమ

Article Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం మల్లెల గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో 33,658 మంది రైతులకు రూ.13.46 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు, అలాగే 28,518 మంది రైతులకు రూ.5.70 కోట్లు పీఎం కిసాన్ నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. మొత్తం కలిపి రూ.19.17 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

గత అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా రైతుల సమస్యలపై మాట్లాడానని ఆయన తెలిపారు. రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే జీవిస్తాడు, అప్పుల్లోనే మరణిస్తాడని పేర్కొన్నారు. అంతటి కష్టాలు పడుతూ కూడా రైతు అందరికీ అన్నం పెడుతున్నాడని, రైతుల కష్టం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. అలాంటి కష్టాల్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ పథకం మూడవ విడతగా రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడో విడత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2,676 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,874 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పున జమ చేయగా, ఈరోజు జమ చేస్తున్న రూ.6 వేలతో కలిపి రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎమ్మార్వో, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ నాయకులు, రైతులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News