తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం
తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఎన్.చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల మేరకు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్గా, నందమూరి బాలకృష్ణ ను పొలిట్బ్యూరో సభ్యుడిగా, బి.కే. పార్థసారథి ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బోర్వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జెసిబి మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, రామాంజినేయులు, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారంయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి