తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం
తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం
Prakash
సోమందేపల్లి, బుధవారం:
తెదేపా పార్టీ జాతీయ కార్యవర్గ నియామకాల నేపథ్యంలో సోమందేపల్లిలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త బాధ్యతలను ప్రకటించగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ, జాతీయ అధికార ప్రతినిధిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు.
ఈ నియామకాలపై ఆనందం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బోర్వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జేసీబీ మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారయ్య తదితరులు పాల్గొన్నారు.
తెదేపా నాయకుల నియామకాలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి