Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:19 AM

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత
May 02, 2026 07:17 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


తదుపరి మంత్రి స్వయంగా క్యాంటీన్‌లో భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యతపై ప్రశ్నించగా, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం అందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News