Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 09:03 PM

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత
May 02, 2026 07:17 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


తదుపరి మంత్రి స్వయంగా క్యాంటీన్‌లో భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యతపై ప్రశ్నించగా, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం అందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News