Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:10 AM

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత
02-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


తదుపరి మంత్రి స్వయంగా క్యాంటీన్‌లో భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యతపై ప్రశ్నించగా, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం అందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.


Sthanikam

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


తదుపరి మంత్రి స్వయంగా క్యాంటీన్‌లో భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యతపై ప్రశ్నించగా, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం అందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News