తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత
తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తదుపరి మంత్రి స్వయంగా క్యాంటీన్లో భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యతపై ప్రశ్నించగా, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం అందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి