PRINT TIME: May 02, 2026 07:51 PM
తహశీల్దార్కు టీఎంఓఏ సభ్యుల సన్మానం
తహశీల్దార్కు టీఎంఓఏ సభ్యుల సన్మానం
May 02, 2026 06:07 PM
13 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఎంఓఏ) ఆధ్వర్యంలో భువనగిరి తహశీల్దార్ సి. జగన్ మోహన్ ప్రసాద్ను సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మీ సేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలని సూచించారు. సర్వీసులకు సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎంఓఏ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జానీ అలీ, కోశాధికారి సజన్లాల్, సభ్యులు భరత్, శ్రీశైలం, రాములు, పురుషోత్తం, సత్యనారాయణ, భాస్కర్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి