Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో టీఎస్‌జేఏ విలీనం

టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో టీఎస్‌జేఏ విలీనం

టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో టీఎస్‌జేఏ విలీనం
May 23, 2026 06:52 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం : చలసాని శ్రీనివాసరావు

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ)లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌జేఏ) శనివారం విలీనం అయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు , జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు ఆధ్వర్యంలో టీఎస్‌జేఏ సభ్యులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో సభ్యత్వం స్వీకరించారు.

ఈ సందర్భంగా టీఎస్‌జేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ను చలసాని శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి యూనియన్‌లోకి ఆహ్వానించారు.

సమావేశంలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని వర్కింగ్ జర్నలిస్టులకు వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీఎస్‌జేఏ వంటి సంఘం విలీనం కావడం స్వాగతించదగ్గ పరిణామమని, కొత్తగా చేరిన సభ్యులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, తమ అసోసియేషన్‌లోని సభ్యులు అందరూ ఒకే వేదికపైకి రావడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దుస్స చంద్రశేఖర్, గుంటి శ్రీనివాస్, మహమ్మద్ గౌస్, కొరివి సతీష్ యాదవ్, సందీప్, యాతాకుల మధుసూదన్, అబ్దుల్ అజీజ్ తదితరులు సభ్యత్వం స్వీకరించారు.

జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, గ్రామీణ విలేకరులకు అండగా నిలుస్తామని నాయకులు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News