Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:47 PM

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత
April 15, 2026 08:57 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎనిమిది రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“విధుల నుండి తొలగిస్తామని బెదిరించినా, మా హక్కులు సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని కార్మికులు స్పష్టం చేశారు.

ఆర్టిజన్ కార్మికుల ఉద్యమంలో భాగంగా నల్గొండ సర్కిల్ కార్యాలయం ముందు 8వ రోజు కూడా సమ్మె కొనసాగించారు. కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను మరోసారి స్పష్టం చేశారు.


ప్రధాన డిమాండ్లు:

విద్యార్హత ఆధారంగా ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ చేయాలి

ఉన్న ఆర్టిజన్ ఉద్యోగులందరికీ APSEB రూల్స్ అమలు చేయాలి

UnManned వర్కర్లందరినీ సంస్థలో విలీనం చేయాలి

మిగిలిన కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలి

పీస్ రేట్ వర్కర్లకు కనీస వేతన చట్టం అమలు చేయాలి

PRC-2026 అమలు చేయాలి

ఈ సమ్మె 08-04-2026 నుండి నిరవధికంగా కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో ట్రేడ్ యూనియన్లు, అసోసియేషన్ నాయకులతో ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు జరిపినప్పటికీ, ప్రభుత్వం తరఫున “ముందుగా విధుల్లో చేరండి, తర్వాత సమస్యలు పరిష్కరిస్తాం” అనే ప్రతిపాదనను ఆర్టిజన్ నాయకులు తిరస్కరించారు.

రేపటికీ సమ్మె కొనసాగించాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా జేఏసీ నాయకులు లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్, డి. రమేష్, వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీపతి రమేష్, అద్దంకి వెంకన్న, లింగారెడ్డి, మల్లేష్, విజయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News