తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత
Editor Desk
నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎనిమిది రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“విధుల నుండి తొలగిస్తామని బెదిరించినా, మా హక్కులు సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని కార్మికులు స్పష్టం చేశారు.
ఆర్టిజన్ కార్మికుల ఉద్యమంలో భాగంగా నల్గొండ సర్కిల్ కార్యాలయం ముందు 8వ రోజు కూడా సమ్మె కొనసాగించారు. కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను మరోసారి స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు:
విద్యార్హత ఆధారంగా ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ చేయాలి
ఉన్న ఆర్టిజన్ ఉద్యోగులందరికీ APSEB రూల్స్ అమలు చేయాలి
UnManned వర్కర్లందరినీ సంస్థలో విలీనం చేయాలి
మిగిలిన కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలి
పీస్ రేట్ వర్కర్లకు కనీస వేతన చట్టం అమలు చేయాలి
PRC-2026 అమలు చేయాలి
ఈ సమ్మె 08-04-2026 నుండి నిరవధికంగా కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో ట్రేడ్ యూనియన్లు, అసోసియేషన్ నాయకులతో ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు జరిపినప్పటికీ, ప్రభుత్వం తరఫున “ముందుగా విధుల్లో చేరండి, తర్వాత సమస్యలు పరిష్కరిస్తాం” అనే ప్రతిపాదనను ఆర్టిజన్ నాయకులు తిరస్కరించారు.
రేపటికీ సమ్మె కొనసాగించాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా జేఏసీ నాయకులు లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్, డి. రమేష్, వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీపతి రమేష్, అద్దంకి వెంకన్న, లింగారెడ్డి, మల్లేష్, విజయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి