టీడీపీ నూతన కార్యాలయానికి భూమిపూజ
టీడీపీ నూతన కార్యాలయానికి భూమిపూజ
Editor Desk
: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో నగరంలోని సి క్యాంప్ సెంటర్ సమీపంలో ఆర్ అండ్ బి కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇన్చార్జీలు కే మీనాక్షి నాయుడు (ఆదోని), వైకుంఠం జ్యోతి (ఆలూరు), ఎన్ రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), కూడ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, చైర్మన్లు, జిల్లా స్థాయి నాయకులు, పార్టీ కార్యదర్శులు, డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మరియు పార్టీ పెద్దల సహకారంతో నూతన కార్యాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి