Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:10 PM

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు
March 10, 2026 10:34 AM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్, : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వేములవాడను కలుపుతూ చేపట్టనున్న రూ.50 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియలో పక్షపాతం, దురుద్దేశం లేదా విధానపరమైన అక్రమాలు ఉన్నట్లు తేలితే తప్ప కోర్టు జోక్యం చేసుకోదని ధర్మాసనం పేర్కొంది.

గతంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టెండరింగ్ అథారిటీకి ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.

ఈ విషయమై శ్రీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.

ఈ తీర్పుతో టెండర్ వ్యవహారాల్లో తుది నిర్ణయం ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు స్పష్టంచేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News