టెండర్పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు
టెండర్పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు
GADDAM JAGANMOHAN REDDY
హైదరాబాద్, : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వేములవాడను కలుపుతూ చేపట్టనున్న రూ.50 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్పై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియలో పక్షపాతం, దురుద్దేశం లేదా విధానపరమైన అక్రమాలు ఉన్నట్లు తేలితే తప్ప కోర్టు జోక్యం చేసుకోదని ధర్మాసనం పేర్కొంది.
గతంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేసి, అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టెండరింగ్ అథారిటీకి ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.
ఈ విషయమై శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.
ఈ తీర్పుతో టెండర్ వ్యవహారాల్లో తుది నిర్ణయం ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు స్పష్టంచేసింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి