Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:38 PM

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు
March 10, 2026 10:34 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్, : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వేములవాడను కలుపుతూ చేపట్టనున్న రూ.50 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియలో పక్షపాతం, దురుద్దేశం లేదా విధానపరమైన అక్రమాలు ఉన్నట్లు తేలితే తప్ప కోర్టు జోక్యం చేసుకోదని ధర్మాసనం పేర్కొంది.

గతంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టెండరింగ్ అథారిటీకి ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.

ఈ విషయమై శ్రీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.

ఈ తీర్పుతో టెండర్ వ్యవహారాల్లో తుది నిర్ణయం ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు స్పష్టంచేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News