టీచర్ల పనితీరుపై ఐదేళ్లకోసారి పరీక్ష.. ఫెయిలైతే ఇంటికే..!!
టీచర్ల పనితీరుపై ఐదేళ్లకోసారి పరీక్ష.. ఫెయిలైతే ఇంటికే..!!
Biksham Goud
విద్యా వ్యవస్థలో సంచలన మార్పులకు విద్యా కమిషన్ ప్రతిపాదనలు
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా విద్యా కమిషన్ కీలక సిఫారసులు చేసింది. కొత్తగా నియామకమయ్యే ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకోసారి పనితీరు పరీక్ష తప్పనిసరి చేయాలని సూచించింది. పనితీరు సరిగా లేని వారిని సేవల నుంచి తప్పించాలనే ప్రతిపాదన కూడా చేసింది.విద్యార్థుల అభ్యసన ఫలితాలకు అరవై శాతం ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ సూచించింది. మిగిలిన శాతం ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం, పాఠశాల హాజరు, బాధ్యత నిర్వహణ వంటి అంశాల ఆధారంగా నిర్ణయించాలన్నారు. విద్యార్థుల ఫలితాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ నిబంధనలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కాకుండా కొత్త నియామకాలకే వర్తిస్తాయని కమిషన్ స్పష్టం చేసింది. నియామకాలను మండల యూనిట్గా నిర్వహించాలని, బదిలీ విధానాన్ని రద్దు చేయాలని సూచించింది. ఉపాధ్యాయుల పదవీ పేర్లలో కూడా మార్పులు చేయాలని ప్రతిపాదించింది. విద్యా నాణ్యత పెంపే ప్రధాన లక్ష్యమని, పాఠశాలల్లో బాధ్యతాయుత బోధనకు ఈ మార్పులు దోహదపడతాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వ స్థాయిలో ఈ సిఫారసులపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి