PRINT TIME: July 03, 2026 07:55 PM
ట్యాంకర్ బోల్తా.. హైవేపై ట్రాఫిక్ స్తంభనం.
ట్యాంకర్ బోల్తా.. హైవేపై ట్రాఫిక్ స్తంభనం.
May 11, 2026 10:58 AM
161 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో, ట్యాంకర్ డివైడర్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.
దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు నెల్లూరు నుంచి సంగారెడ్డికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి