Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 11:44 PM

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
April 30, 2026 10:07 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్య వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదు చేసి ఓపీఎంఎస్‌లో అప్లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటివరకు రూ.571 కోట్ల విలువైన 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేస్తేనే నగదు చెల్లింపులు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ బాధ్యత కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, మిల్లర్లపై ఉందని పేర్కొన్నారు.

మిల్లర్ల నుండి అంగీకార పత్రం వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కామన్, ఏ-గ్రేడ్‌గా వర్గీకరించాలని సూచించారు. కొన్ని చోట్ల అంగీకార పత్రాలు సేకరించకపోవడం, ఓపీఎంఎస్‌లో నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్రక్ షీట్ జనరేషన్ పెంచాలని, మే 1 లోపు జిల్లాలోని అన్ని ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లర్లు లారీలను ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయాలని, లేకపోతే సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరగాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News