ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
Komidala Mahender reddy
జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్య వివరాలను వెంటనే ట్యాబ్లలో నమోదు చేసి ఓపీఎంఎస్లో అప్లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటివరకు రూ.571 కోట్ల విలువైన 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేస్తేనే నగదు చెల్లింపులు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ బాధ్యత కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, మిల్లర్లపై ఉందని పేర్కొన్నారు.
మిల్లర్ల నుండి అంగీకార పత్రం వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కామన్, ఏ-గ్రేడ్గా వర్గీకరించాలని సూచించారు. కొన్ని చోట్ల అంగీకార పత్రాలు సేకరించకపోవడం, ఓపీఎంఎస్లో నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ట్రక్ షీట్ జనరేషన్ పెంచాలని, మే 1 లోపు జిల్లాలోని అన్ని ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లర్లు లారీలను ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలని, లేకపోతే సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరగాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి