Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:39 AM

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు
April 30, 2026 10:07 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్య వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదు చేసి ఓపీఎంఎస్‌లో అప్లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటివరకు రూ.571 కోట్ల విలువైన 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేస్తేనే నగదు చెల్లింపులు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ బాధ్యత కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, మిల్లర్లపై ఉందని పేర్కొన్నారు.

మిల్లర్ల నుండి అంగీకార పత్రం వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కామన్, ఏ-గ్రేడ్‌గా వర్గీకరించాలని సూచించారు. కొన్ని చోట్ల అంగీకార పత్రాలు సేకరించకపోవడం, ఓపీఎంఎస్‌లో నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్రక్ షీట్ జనరేషన్ పెంచాలని, మే 1 లోపు జిల్లాలోని అన్ని ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లర్లు లారీలను ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయాలని, లేకపోతే సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరగాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News