Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:08 PM

ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు

ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు

ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు
June 08, 2026 12:39 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఓటీపీ కోసం ఎదురుచూపులు.. ఖాతాల్లోకి రాని ధాన్యం డబ్బులు


ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించిన రైతులు ఇప్పుడు తమ కష్టార్జిత డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 29న పెద్దకాపర్తి PACS కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తయినా, ఇప్పటి వరకు ట్రాక్ షీట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వందలాది మంది రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం విక్రయించి పది రోజులకు పైగా గడిచినా చెల్లింపులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వరికోత యంత్రాల యజమానులు, ట్రాక్టర్ నిర్వాహకులు, ఎరువుల దుకాణాల యజమానులు, ధాన్యం ఆరబోసిన కూలీలు, పట్టాలు ఇచ్చిన వారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా చేతికి డబ్బులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ధాన్యం అమ్మిన తర్వాత వచ్చిన మొత్తంతో అప్పులు తీర్చుకోవాలని భావించినా, చెల్లింపుల జాప్యం వారి ఆశలను నీరుగారుస్తోందని పేర్కొంటున్నారు. మరోవైపు తదుపరి పంటల సాగుకు సన్నాహాలు చేయాల్సిన సమయంలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోందని వాపోతున్నారు.పెద్దకాపర్తి PACS కేంద్రం అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్ షీట్ ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ కోసం ఎదురుచూస్తున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

"పంట పండించడం కంటే అమ్మిన ధాన్యానికి డబ్బులు రావడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది" అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తక్షణ జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News