సూపరింటెండెంట్ లావణ్యకు ఘన సన్మానం
సూపరింటెండెంట్ లావణ్యకు ఘన సన్మానం
Editor Desk
హయత్నగర్, : ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేసిన ఎ. లావణ్య రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన సందర్భంగా శనివారం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవడం లావణ్యకు ప్రత్యేకతని తెలిపారు. కుటుంబ అవసరాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న భర్త, పిల్లలతో కలవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం ఆమె త్యాగానికి నిదర్శనమని అన్నారు.
కళాశాలలో పనిచేసిన కాలంలో అందరితో సాన్నిహిత్యం పెంచుకుని, సేవాభావంతో పనిచేసిన విధానాన్ని సిబ్బంది కొనియాడారు. ఆమెను శాలువాలు, పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిర, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డా. సుబ్రమణ్యం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ సహచరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి