Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోటకొండూరులో ఘన నివాళులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 07:58 PM

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా
April 14, 2026 03:48 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి,

“అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం.. మహనీయుని అడుగుజాడల్లో నడుద్దాం” అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతిని సోమందేపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన రూపొందించిన రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని తెలిపారు.

అయితే, రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని చట్టాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శిలా నారాయణస్వామి, పార్టీ సభ్యులు నరసింహమూర్తి యాదవ్, చంద్రశేఖర్, శ్రీకాంత్, బాబాజాన్, ఆంజనేయులు, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు అంజనమ్మ, నూర్జాన్, బేబీ, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News