సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా
సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా
Prakash
సోమందేపల్లి,
“అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం.. మహనీయుని అడుగుజాడల్లో నడుద్దాం” అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతిని సోమందేపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన రూపొందించిన రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని తెలిపారు.
అయితే, రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని చట్టాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శిలా నారాయణస్వామి, పార్టీ సభ్యులు నరసింహమూర్తి యాదవ్, చంద్రశేఖర్, శ్రీకాంత్, బాబాజాన్, ఆంజనేయులు, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు అంజనమ్మ, నూర్జాన్, బేబీ, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి