Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం

సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం

సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం
05-05-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు దోమలపల్లి నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి సిపిఎం గ్రామ శాఖ అండగా నిలిచింది. పార్టీ తరఫున నరసింహ కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ మొత్తాన్ని నరసింహ భార్య పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చెక్కును రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. నరసింహ మరణించిన రోజున అంత్యక్రియల ఖర్చులను కూడా పార్టీ గ్రామ శాఖ భరించింది.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ, దోమలపల్లి నరసింహ పార్టీ మరియు ప్రజాసంఘాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, మాజీ సర్పంచ్ మిరియాల భాస్కర్, నాయకులు కూనూరు వెంకటేశం, మోటే స్వామి, కూనూరు గణేష్, బైరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిల్వేరు రాజు, మార్త భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నరసింహ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

Sthanikam

సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం

Article Image

రామన్న పేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు దోమలపల్లి నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి సిపిఎం గ్రామ శాఖ అండగా నిలిచింది. పార్టీ తరఫున నరసింహ కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ మొత్తాన్ని నరసింహ భార్య పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చెక్కును రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. నరసింహ మరణించిన రోజున అంత్యక్రియల ఖర్చులను కూడా పార్టీ గ్రామ శాఖ భరించింది.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ, దోమలపల్లి నరసింహ పార్టీ మరియు ప్రజాసంఘాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, మాజీ సర్పంచ్ మిరియాల భాస్కర్, నాయకులు కూనూరు వెంకటేశం, మోటే స్వామి, కూనూరు గణేష్, బైరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిల్వేరు రాజు, మార్త భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నరసింహ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News