సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం
సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం
Editor Desk
రామన్న పేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు దోమలపల్లి నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి సిపిఎం గ్రామ శాఖ అండగా నిలిచింది. పార్టీ తరఫున నరసింహ కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ మొత్తాన్ని నరసింహ భార్య పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చెక్కును రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. నరసింహ మరణించిన రోజున అంత్యక్రియల ఖర్చులను కూడా పార్టీ గ్రామ శాఖ భరించింది.
ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ, దోమలపల్లి నరసింహ పార్టీ మరియు ప్రజాసంఘాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, మాజీ సర్పంచ్ మిరియాల భాస్కర్, నాయకులు కూనూరు వెంకటేశం, మోటే స్వామి, కూనూరు గణేష్, బైరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిల్వేరు రాజు, మార్త భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నరసింహ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి