Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:54 PM

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు
April 15, 2026 09:24 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

మండల కేంద్రంలోని లక్కారం గ్రామంలో వెలసిన హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. షేక్ సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం వారు చేసిన కృషి, బోధనలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఏటా ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను అభినందించారు.​ఈ ఉత్సవాల్లో దర్గా నిర్వాహకులు సయ్యద్ సలీం, సయ్యద్,​మైనార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News