శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు
శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు
K.RAVI
ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి
మండల కేంద్రంలోని లక్కారం గ్రామంలో వెలసిన హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. షేక్ సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం వారు చేసిన కృషి, బోధనలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఏటా ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను అభినందించారు.ఈ ఉత్సవాల్లో దర్గా నిర్వాహకులు సయ్యద్ సలీం, సయ్యద్,మైనార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి