శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం
శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం
Vikram
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు విద్యార్థులలో మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కీలక పాత్ర పోషించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి