శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్
శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్
Editor Desk
నల్గొండ నగర పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు గుండగోని నాగయ్య, పుష్పలత, గుండగోని పరమేష్, చంద్రకళలు అతిథులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని నగరానికి సమీపంలో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ వేదికను వివాహాది శుభకార్యాలకు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్, కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండారు ప్రసాద్, కార్పొరేటర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి