శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...
శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...
Harish K
ప్రత్యేక పూజ కార్యక్రమం పాల్గొన్న సినీనటి రోజా..
మునగాల మండల పరిధిలో తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహా గణపతి సుబ్రహ్మణ్య సహిత రామలింగేశ్వర నందీశ్వర కీర్తిద్వజ ద్వారా పాలక శిఖర నవగ్రహాముల జంటనాగేంద్రడి స్థీర ప్రతిష్ట మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన విగ్రహాల ప్రతిష్టకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. సోమవారం 4వ తారీఖు నుండి మూడు రోజుల పాటు గ్రామంలో యాగశాలలో వేదపండితులు ,అర్చకులు నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి
సినీ నటి రోజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామంలో ప్రజలందరూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ భగవంతుడు కృపకు పాత్రులు కాగలరని కోరారు.
విగ్రహల ప్రతిష్ట నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు, బంధువులు, కుటుంబసభ్యులువిగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నేపధ్యంలో తిమ్మారెడ్డి గూడెం పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ విగ్రహ ప్రతిష్టకు గ్రామ పురోహితులు వేదం రంగయ్య శాస్త్రీ, పర్యవేక్షణలో కితావారిగూడెం వాస్తవ్యులు రాయప్రోలు శ్రీ రామయ్య బ్రదర్స్, కోదాడ వాస్తవ్యులు రాళ్ళబండి రాజశేఖర్ బృందంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గ్రామ ప్రజలు మహిళలు యువత యువకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి