Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:15 PM

శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
March 02, 2026 08:00 PM 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.

రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామంలోని

శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా రాత్రి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ చిట్నేని వెంకటేశ్వరరావు, ఆలయ అధ్యక్షులు బి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి తాండ్రగిరి రావు లు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏడవ వార్షికోత్సవమును ఈనెల 2 నుండి 7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మంగళవారం ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము అని తెలిపారు. రెండవ రోజు బుధవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం ఎదుర్కోళ్ళ ఉత్సవము, దీపోత్సవము, మూడవ రోజు గురువారం ఉదయం 10 : 30 నిలకు శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము, నాలుగవ రోజు శుక్రవారం రాత్రి రథోత్సవము, ఐదవ రోజు శనివారం ఉదయం చక్రస్నానము, రాత్రి ద్వజ అవరోహణము తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని కావున పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News