Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:16 AM

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి
04-05-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో తొలి దరఖాస్తు – సానుకూల స్పందన

సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఆర్డీవో కృష్ణారెడ్డిని కోరారు. సోమవారం భువనగిరి రెవెన్యూ అధికార కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి దరఖాస్తుగా ఆయన వినతి సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యుల ఆదరణ లేక బాధలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆర్డీవో ఇచ్చే ఆదేశాలను అమలు చేయని వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, పెండింగ్ కేసులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్డీవో కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదేశాలు అమలు కాకపోతే మండల తహసీల్దార్ లేదా ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజావాణిలో తొలి దరఖాస్తు సమర్పించిన వెంకటేష్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డీఏఓ రాధా, తహసీల్దార్లు జగన్, శ్యాం సుందర్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సుమన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి

Article Image

ప్రజావాణిలో తొలి దరఖాస్తు – సానుకూల స్పందన

సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఆర్డీవో కృష్ణారెడ్డిని కోరారు. సోమవారం భువనగిరి రెవెన్యూ అధికార కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి దరఖాస్తుగా ఆయన వినతి సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యుల ఆదరణ లేక బాధలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆర్డీవో ఇచ్చే ఆదేశాలను అమలు చేయని వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, పెండింగ్ కేసులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్డీవో కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదేశాలు అమలు కాకపోతే మండల తహసీల్దార్ లేదా ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజావాణిలో తొలి దరఖాస్తు సమర్పించిన వెంకటేష్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డీఏఓ రాధా, తహసీల్దార్లు జగన్, శ్యాం సుందర్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సుమన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News