సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి
సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి
Editor Desk
ప్రజావాణిలో తొలి దరఖాస్తు – సానుకూల స్పందన
సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఆర్డీవో కృష్ణారెడ్డిని కోరారు. సోమవారం భువనగిరి రెవెన్యూ అధికార కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి దరఖాస్తుగా ఆయన వినతి సమర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యుల ఆదరణ లేక బాధలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆర్డీవో ఇచ్చే ఆదేశాలను అమలు చేయని వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, పెండింగ్ కేసులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్డీవో కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదేశాలు అమలు కాకపోతే మండల తహసీల్దార్ లేదా ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజావాణిలో తొలి దరఖాస్తు సమర్పించిన వెంకటేష్ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీఏఓ రాధా, తహసీల్దార్లు జగన్, శ్యాం సుందర్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సుమన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి