Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:19 AM

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య
02-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు, : సీలింగ్ భూముల కబ్జాపై సమగ్ర విచారణ జరపకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు.

మండలంలోని సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లో సర్వే నంబర్లు 322, 728ల పరిధిలో ఉన్న సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అక్రమంగా వెంచర్‌గా అభివృద్ధి చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ప్లాట్లు కేటాయించినప్పటికీ వాటి స్థితి స్పష్టంగా లేదని తెలిపారు. ఒక్కో ప్లాట్‌ను పలువురికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలూ ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ అంశంపై రెండు వారాల క్రితం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదని విమర్శించారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

అలాగే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకటించిన ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాపట్ల నరహరి, ముక్యర్ల సతీశ్ యాదవ్, కల్వకొలను సతీశ్ భట్, జీ రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

Article Image

ఆలేరు, : సీలింగ్ భూముల కబ్జాపై సమగ్ర విచారణ జరపకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు.

మండలంలోని సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లో సర్వే నంబర్లు 322, 728ల పరిధిలో ఉన్న సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అక్రమంగా వెంచర్‌గా అభివృద్ధి చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ప్లాట్లు కేటాయించినప్పటికీ వాటి స్థితి స్పష్టంగా లేదని తెలిపారు. ఒక్కో ప్లాట్‌ను పలువురికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలూ ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ అంశంపై రెండు వారాల క్రితం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదని విమర్శించారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

అలాగే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకటించిన ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాపట్ల నరహరి, ముక్యర్ల సతీశ్ యాదవ్, కల్వకొలను సతీశ్ భట్, జీ రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News