Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 08:54 PM

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య
May 02, 2026 07:29 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు, : సీలింగ్ భూముల కబ్జాపై సమగ్ర విచారణ జరపకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు.

మండలంలోని సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లో సర్వే నంబర్లు 322, 728ల పరిధిలో ఉన్న సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అక్రమంగా వెంచర్‌గా అభివృద్ధి చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ప్లాట్లు కేటాయించినప్పటికీ వాటి స్థితి స్పష్టంగా లేదని తెలిపారు. ఒక్కో ప్లాట్‌ను పలువురికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలూ ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ అంశంపై రెండు వారాల క్రితం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదని విమర్శించారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

అలాగే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకటించిన ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాపట్ల నరహరి, ముక్యర్ల సతీశ్ యాదవ్, కల్వకొలను సతీశ్ భట్, జీ రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News