సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్ఎస్ నేత కర్రె వెంకటయ్య
సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్ఎస్ నేత కర్రె వెంకటయ్య
Editor Desk
ఆలేరు, : సీలింగ్ భూముల కబ్జాపై సమగ్ర విచారణ జరపకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు.
మండలంలోని సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లో సర్వే నంబర్లు 322, 728ల పరిధిలో ఉన్న సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అక్రమంగా వెంచర్గా అభివృద్ధి చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ప్లాట్లు కేటాయించినప్పటికీ వాటి స్థితి స్పష్టంగా లేదని తెలిపారు. ఒక్కో ప్లాట్ను పలువురికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలూ ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ అంశంపై రెండు వారాల క్రితం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదని విమర్శించారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
అలాగే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకటించిన ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాపట్ల నరహరి, ముక్యర్ల సతీశ్ యాదవ్, కల్వకొలను సతీశ్ భట్, జీ రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి