Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:14 AM

సీఎం చంద్రబాబు గారి ఫొటోకు పాలాభిషేకం చేసిన పవర్‌లూమ్స్ కార్మికులు

సీఎం చంద్రబాబు గారి ఫొటోకు పాలాభిషేకం చేసిన పవర్‌లూమ్స్ కార్మికులు

సీఎం చంద్రబాబు గారి ఫొటోకు పాలాభిషేకం చేసిన పవర్‌లూమ్స్ కార్మికులు
04-05-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేసిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల ఆంబరీష్ ఆధ్వర్యంలో చేపట్టారు.


ఈ సందర్భంగా కార్మికులు తమ ఉచిత విద్యుత్ బిల్లులను చూపిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


నిమ్మల ఆంబరీష్ మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720, సంవత్సరానికి రూ.8,640; మరమగ్గం కుటుంబాలకు నెలకు రూ.1,800, సంవత్సరానికి రూ.21,600 లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది చేనేత కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.


అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

సీఎం చంద్రబాబు గారి ఫొటోకు పాలాభిషేకం చేసిన పవర్‌లూమ్స్ కార్మికులు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేసిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల ఆంబరీష్ ఆధ్వర్యంలో చేపట్టారు.


ఈ సందర్భంగా కార్మికులు తమ ఉచిత విద్యుత్ బిల్లులను చూపిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


నిమ్మల ఆంబరీష్ మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720, సంవత్సరానికి రూ.8,640; మరమగ్గం కుటుంబాలకు నెలకు రూ.1,800, సంవత్సరానికి రూ.21,600 లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది చేనేత కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.


అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News