సీఎం చంద్రబాబు గారి ఫొటోకు పాలాభిషేకం చేసిన పవర్లూమ్స్ కార్మికులు
సీఎం చంద్రబాబు గారి ఫొటోకు పాలాభిషేకం చేసిన పవర్లూమ్స్ కార్మికులు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో పవర్లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేసిన సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల ఆంబరీష్ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు తమ ఉచిత విద్యుత్ బిల్లులను చూపిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిమ్మల ఆంబరీష్ మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720, సంవత్సరానికి రూ.8,640; మరమగ్గం కుటుంబాలకు నెలకు రూ.1,800, సంవత్సరానికి రూ.21,600 లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది చేనేత కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి