Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:06 AM

సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా యోగ బ్రోచర్ ఆవిష్కరణ

సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా యోగ బ్రోచర్ ఆవిష్కరణ

సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా యోగ బ్రోచర్ ఆవిష్కరణ
26-03-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో 9 రోజుల యోగశిక్షణా తరగతులకు ఏర్పాట్లు పూర్తి

రామన్నపేట: ఆరోగ్యకర జీవనానికి యోగ సాధన అత్యంత అవసరమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రామన్నపేటలో నిర్వహించనున్న తొమ్మిది రోజుల యోగశిక్షణా తరగతుల బ్రోచర్‌ను ఆయన సబ్ ఇన్స్పెక్టర్ డి. నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు.

అమృతవనం అగ్రిఫామ్ రిసార్టులో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6 వరకు శ్రీ శిరిడి సాయి అష్టాంగ ఆధ్వర్యంలో యోగ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువు యోగేశ్వర్, రిసార్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కడారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వ్యాయామాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం, ఆసనాలు నేర్పించడంతో పాటు ‘అమృత ఆహారం’ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యోగాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకోవాలని సీఐ సూచించారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు 9603256572 నంబరును సంప్రదించాలని కోరారు.

Sthanikam

సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా యోగ బ్రోచర్ ఆవిష్కరణ

Article Image

రామన్నపేటలో 9 రోజుల యోగశిక్షణా తరగతులకు ఏర్పాట్లు పూర్తి

రామన్నపేట: ఆరోగ్యకర జీవనానికి యోగ సాధన అత్యంత అవసరమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రామన్నపేటలో నిర్వహించనున్న తొమ్మిది రోజుల యోగశిక్షణా తరగతుల బ్రోచర్‌ను ఆయన సబ్ ఇన్స్పెక్టర్ డి. నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు.

అమృతవనం అగ్రిఫామ్ రిసార్టులో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6 వరకు శ్రీ శిరిడి సాయి అష్టాంగ ఆధ్వర్యంలో యోగ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువు యోగేశ్వర్, రిసార్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కడారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వ్యాయామాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం, ఆసనాలు నేర్పించడంతో పాటు ‘అమృత ఆహారం’ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యోగాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకోవాలని సీఐ సూచించారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు 9603256572 నంబరును సంప్రదించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News