నకిలీ వైద్యం చేస్తున్న డెంటిస్ట్ గుట్టురట్టైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన రమేష్ అనే వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. పదో తరగతి కూడా పూర్తిచేయకుండా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్గా మారి ప్రజలను మోసం చేస్తున్నాడు.
నేరేడ్మెట్ పరిధిలో డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి చాలా కాలంగా వైద్యం చేస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి