సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రామతీర్థం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది
సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రామతీర్థం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో కాంక్రీట్ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ పనులను ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గ్రామంలోని ప్రధాన వీధులు మరియు అంతర్గత రహదారులను సిమెంట్ కాంక్రీట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తుండటంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఏర్పడే బురద సమస్యలు, రహదారి దెబ్బతినే సమస్యలు ఇక తగ్గనున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని
అధికారులకు సర్పంచ్ సూచనలు చేసినట్లు తెలిపారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకున్నారు.గ్రామంలో రహదారి పనులు పూర్తయిన తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి