Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రామతీర్థం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రామతీర్థం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రామతీర్థం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది
27-03-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో కాంక్రీట్ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ పనులను ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గ్రామంలోని ప్రధాన వీధులు మరియు అంతర్గత రహదారులను సిమెంట్ కాంక్రీట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తుండటంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఏర్పడే బురద సమస్యలు, రహదారి దెబ్బతినే సమస్యలు ఇక తగ్గనున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని

అధికారులకు సర్పంచ్ సూచనలు చేసినట్లు తెలిపారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకున్నారు.గ్రామంలో రహదారి పనులు పూర్తయిన తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.



Sthanikam

సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రామతీర్థం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో కాంక్రీట్ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ పనులను ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గ్రామంలోని ప్రధాన వీధులు మరియు అంతర్గత రహదారులను సిమెంట్ కాంక్రీట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తుండటంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఏర్పడే బురద సమస్యలు, రహదారి దెబ్బతినే సమస్యలు ఇక తగ్గనున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని

అధికారులకు సర్పంచ్ సూచనలు చేసినట్లు తెలిపారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకున్నారు.గ్రామంలో రహదారి పనులు పూర్తయిన తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News