Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:03 AM

సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు

సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు

సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు
28-04-2026 305 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ,

కూచిపూడి గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం, సర్పంచ్ భర్త జోక్యం పెరిగిందని ఆరోపిస్తూ 2వ వార్డు సభ్యుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వార్డు సభ్యుడు కటిక గోపాల్‌రావు సమర్పించిన వినతిపత్రంలో… వార్డులో సీసీ రోడ్డుపై మురికి నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ వర్షాకాల పరిస్థితులు నెలకొని దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించకుండా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

సర్పంచ్ భర్త గ్రామపంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వార్డు సభ్యులను బెదిరిస్తున్నారని, సమస్యలు ప్రస్తావిస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. పంచాయతీ సిబ్బందిని కూడా తన అనుమతి లేకుండా పనులకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.

ఈ అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.


Sthanikam

సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు

Article Image

కోదాడ,

కూచిపూడి గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం, సర్పంచ్ భర్త జోక్యం పెరిగిందని ఆరోపిస్తూ 2వ వార్డు సభ్యుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వార్డు సభ్యుడు కటిక గోపాల్‌రావు సమర్పించిన వినతిపత్రంలో… వార్డులో సీసీ రోడ్డుపై మురికి నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ వర్షాకాల పరిస్థితులు నెలకొని దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించకుండా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

సర్పంచ్ భర్త గ్రామపంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వార్డు సభ్యులను బెదిరిస్తున్నారని, సమస్యలు ప్రస్తావిస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. పంచాయతీ సిబ్బందిని కూడా తన అనుమతి లేకుండా పనులకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.

ఈ అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News