Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:33 AM

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ
08-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

అమరావతి, బుధవారం: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్. సవితతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల విస్తరణ, చేనేత మరియు జౌళి రంగ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

అదేవిధంగా సాగర సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అధికారులు వివరంగా ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

Article Image

అమరావతి, బుధవారం: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్. సవితతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల విస్తరణ, చేనేత మరియు జౌళి రంగ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

అదేవిధంగా సాగర సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అధికారులు వివరంగా ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News