అమరావతి, బుధవారం: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్. సవితతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల విస్తరణ, చేనేత మరియు జౌళి రంగ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
అదేవిధంగా సాగర సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అధికారులు వివరంగా ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి