Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ
April 08, 2026 08:25 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

అమరావతి, బుధవారం: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్. సవితతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల విస్తరణ, చేనేత మరియు జౌళి రంగ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

అదేవిధంగా సాగర సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అధికారులు వివరంగా ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News