Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిర్గాపూర్‌లో బాలల భద్రతపై భరోసా సెంటర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 08:51 PM

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.
April 30, 2026 07:25 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదో తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన సద్గురు యాదవ్ 532 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా భోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ విద్యార్థి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థికి శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి సన్మానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రుల కృషికి తగిన ఫలితం దక్కిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సర్పంచ్ స్వయంగా ఇంటికి వచ్చి అభినందించడం పట్ల విద్యార్థి, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News