సద్గురు యాదవ్కు సర్పంచ్ అభినందనలు.
సద్గురు యాదవ్కు సర్పంచ్ అభినందనలు.
Editor Desk
పదో తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన సద్గురు యాదవ్ 532 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా భోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ విద్యార్థి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థికి శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి సన్మానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రుల కృషికి తగిన ఫలితం దక్కిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సర్పంచ్ స్వయంగా ఇంటికి వచ్చి అభినందించడం పట్ల విద్యార్థి, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి