Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:21 PM

సాంబారుపై గొడవ… మహిళ మృతి

సాంబారుపై గొడవ… మహిళ మృతి

సాంబారుపై గొడవ… మహిళ మృతి
March 09, 2026 01:38 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చిన్న వాగ్వాదం పెద్ద విషాదంగా మారిన ఘటన

చిన్న విషయంపై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. సాంబారు వంటకం విషయంలో జరిగిన గొడవ చివరకు కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. తెలిసిన వివరాల ప్రకారం… బెంగుళూరుకు చెందిన కావ్య (27)కు ఐదేళ్ల క్రితం రంగస్వామితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేసిన సాంబారును చల్లని పెట్టెలో ఉంచి ప్రతిరోజూ వేడి చేసి వడ్డిస్తోందని భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో మనస్తాపానికి గురైన కావ్య కోపంతో ఇంటి స్నాన గదిలోకి వెళ్లింది. అక్కడ పొలాల కోసం ఇంట్లో ఉంచిన పురుగుల మందును తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న విషయంపై జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణాలు తీసుకోవడం ప్రాంతంలో కలకలం రేపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News