Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:02 PM

సాంబారుపై గొడవ… మహిళ మృతి

సాంబారుపై గొడవ… మహిళ మృతి

సాంబారుపై గొడవ… మహిళ మృతి
09-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చిన్న వాగ్వాదం పెద్ద విషాదంగా మారిన ఘటన

చిన్న విషయంపై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. సాంబారు వంటకం విషయంలో జరిగిన గొడవ చివరకు కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. తెలిసిన వివరాల ప్రకారం… బెంగుళూరుకు చెందిన కావ్య (27)కు ఐదేళ్ల క్రితం రంగస్వామితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేసిన సాంబారును చల్లని పెట్టెలో ఉంచి ప్రతిరోజూ వేడి చేసి వడ్డిస్తోందని భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో మనస్తాపానికి గురైన కావ్య కోపంతో ఇంటి స్నాన గదిలోకి వెళ్లింది. అక్కడ పొలాల కోసం ఇంట్లో ఉంచిన పురుగుల మందును తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న విషయంపై జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణాలు తీసుకోవడం ప్రాంతంలో కలకలం రేపింది.

Sthanikam

సాంబారుపై గొడవ… మహిళ మృతి

Article Image

చిన్న వాగ్వాదం పెద్ద విషాదంగా మారిన ఘటన

చిన్న విషయంపై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. సాంబారు వంటకం విషయంలో జరిగిన గొడవ చివరకు కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. తెలిసిన వివరాల ప్రకారం… బెంగుళూరుకు చెందిన కావ్య (27)కు ఐదేళ్ల క్రితం రంగస్వామితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేసిన సాంబారును చల్లని పెట్టెలో ఉంచి ప్రతిరోజూ వేడి చేసి వడ్డిస్తోందని భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో మనస్తాపానికి గురైన కావ్య కోపంతో ఇంటి స్నాన గదిలోకి వెళ్లింది. అక్కడ పొలాల కోసం ఇంట్లో ఉంచిన పురుగుల మందును తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న విషయంపై జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణాలు తీసుకోవడం ప్రాంతంలో కలకలం రేపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News