రామన్నపేట మండలంలోని చిన్నోజు రుక్నమ్మ అనారోగ్యంతో మృతి చెందగా గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహానికి గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మొహమ్మద్ అంజద్, గొరిగే శేఖర్, మొహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, మొహమ్మద్ అక్రమ్, గొలుసుల ప్రసాద్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ జానీ, లవణం సాయి, తెల్ల ప్రసాద్, ఎండి నజీర్, ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి