Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 09:10 PM

రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత

రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత

రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత
May 03, 2026 07:18 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు

అభివృద్ధి చేసిన నాయకులకు ప్రజల ఆశీర్వాదం పూలవర్షంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత పేర్కొన్నారు.

జూలకుంట నుండి ఓబులదేవరపల్లి గ్రామం వరకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అలాగే హిందూపురం రహదారి నుండి రేణుక నగర్ వరకు రూ.50 లక్షలతో నిర్మించిన మరో బీటీ రోడ్డును కూడా ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి సవితకు ఘన స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు పూర్తి కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అదే అసంతృప్తితో ప్రజలు అప్పట్లో నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.

ఇంకా సోమందేపల్లి మండలంలో మరుకుంటపల్లి–పత్తికుంటపల్లి, హిందూపురం రహదారి–కొలింపల్లి, బ్రాహ్మణపల్లి–పందిపర్తి, మంచేపల్లి–పందిపర్తి, పోలేపల్లి–రాచుపల్లి క్రాస్ రోడ్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా చాలాకూరు నుండి మండ్లి, జూలకుంట చెరువులకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా రూ.14 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి, పది చెరువులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాలని మంత్రి సవిత కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News