రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత
రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు
అభివృద్ధి చేసిన నాయకులకు ప్రజల ఆశీర్వాదం పూలవర్షంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత పేర్కొన్నారు.
జూలకుంట నుండి ఓబులదేవరపల్లి గ్రామం వరకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అలాగే హిందూపురం రహదారి నుండి రేణుక నగర్ వరకు రూ.50 లక్షలతో నిర్మించిన మరో బీటీ రోడ్డును కూడా ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి సవితకు ఘన స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు పూర్తి కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అదే అసంతృప్తితో ప్రజలు అప్పట్లో నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.
ఇంకా సోమందేపల్లి మండలంలో మరుకుంటపల్లి–పత్తికుంటపల్లి, హిందూపురం రహదారి–కొలింపల్లి, బ్రాహ్మణపల్లి–పందిపర్తి, మంచేపల్లి–పందిపర్తి, పోలేపల్లి–రాచుపల్లి క్రాస్ రోడ్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా చాలాకూరు నుండి మండ్లి, జూలకుంట చెరువులకు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా రూ.14 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి, పది చెరువులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాలని మంత్రి సవిత కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి